- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Posani: పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ.. అదోని కోర్టు తీర్పుపై ఉత్కంఠ

దిశ, వెబ్డెస్క్: వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) బెయిల్ పిటిషన్పై ఇవాళ అదోని కోర్టు (Adoni Court)లో విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోసాని కస్టడీ పిటిషన్పై ఇప్పటికే కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దీంతో ఆయనను పోలీసులు నేరుగా కర్నూలు జైలుకు తెసుకెళ్లగా.. గత ఐదు రోజులుగా అక్కడే రిమాండ్లో ఉన్నారు. కాగా, సీఎం చంద్రబాబు (CM Chandrababu), మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan), కుటుంబం సభ్యులను సోషల్ మీడియా (Social Media) వేదికగా దూషించారనే ఫిర్యాదు మేరకు ఆదోని (Adoni ట్రీ టౌన్లో కేసు నమోదైంది. దీంతో పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో కర్నూలు (Kurnool) జైలుకు తరలించారు.
అయితే, పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి (Obulavaripalli) పోలీస్ స్టేషన్లో పోసానిపై నమోదైన కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 24న కేసు నమోదు కాగా.. 28న ఓబులవారిపల్లి పోలీసులు పోసాని కృష్ణ మురళిని అరెస్టు చేశారు. 29న రైల్వే కోడూరు (Railway Kodur) కోర్టులో హాజరుపర్చగా.. పోసానికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలోనే పాలకొండ (Palakonda), భవానీపురం (Bhavanipuram), పాడేరు (Paderu), విశాఖ (Vishakha), పట్టాభిపురం (Pattabhipuram)లో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ పోసాని హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. నేడు ఆయన క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ధర్మసనం విచారణ చేపట్టనుంది.