- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
High Court: భార్య వల్గర్ చాట్ చేయడాన్ని ఏ భర్త సహించడు- విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

దిశ, నేషనల్ బ్యూరో: “మగ స్నేహితుడితో భార్య వల్గర్ చాట్ చేయడాన్ని ఏ భర్త సహించడు“ అని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. వివాహం తర్వాత భార్య తమ స్నేహితులతో 'అసభ్యకరమైన' సంభాషణలు జరపకూడదని.. ఏ భర్త కూడా తన భార్య నుండి అలాంటి చాట్లను సహించలేడని పేర్కొంది. విడాకులకు అనుమతిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ క్రూరత్వం కారణంగా కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా.. జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ గజేంద్ర సింగ్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ తీర్పును సమర్థించింది. ఆ మహిళ తన మగ స్నేహితులతో తన లైంగిక జీవితం గురించి చాట్ చేస్తోందని కోర్టు గమనించి, అలాంటి ప్రవర్తనను ఏ భర్త కూడా సహించడని పేర్కొంది. పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ స్నేహితులతో మాట్లాడే స్వేచ్ఛను కలిగి ఉంటారంది. కానీ, సంభాషణ స్థాయి మర్యాదగా, గౌరవప్రదంగా ఉండాలని సూచించింది. ఆ చాట్ జీవిత భాగస్వామికి అభ్యంతకరంగా అన్పించకూడదని జడ్జిలు స్పష్టం చేశారు. దంపతుల్లో ఏ ఒక్కరికైనా అభ్యంతరాలు ఉంటే అలాంటి కార్యకలాపాలను కొనసాగిస్తే, అది నిస్సందేహంగా మానసిక క్రూరత్వానికి సమానం అవుతుందని కోర్టు నొక్కి చెప్పింది.
మగ స్నేహితులతో చాటింగ్
పిటిషనర్ కు ఆమె భర్తతో 2018లో వివాహం చేసుకున్నారు. భర్త ఫిర్యాదు ప్రకారం, వివాహం తర్వాత ఆ మహిళ తన పాత మగ స్నేహితులతో మొబైల్లో మాట్లాడేది. వాట్సాప్ సంభాషణలు అసభ్యకరంగా ఉన్నాయని కూడా అతను ఆరోపించాడు. అయితే, తనకు అలాంటి సంబంధం లేదని చెబుతూ ఆ మహిళ ఆ వాదనలను తోసిపుచ్చింది. తన భర్త తన మొబైల్ ఫోన్ను హ్యాక్ చేసి, తనకు వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించడానికి ఆ సందేశాలను ఇద్దరు పురుషులకు పంపాడని కూడా ఆమె పేర్కొంది. తన భర్త చర్యలు తన గోప్యతా హక్కును ఉల్లంఘించాయని ఆ మహిళ ఆరోపించింది. అయితే ఆ మహిళ తండ్రి కూడా తన కుమార్తె తన మగ స్నేహితులతో మాట్లాడేదని సాక్ష్యమిచ్చాడు. దీంతో, వారిద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.