Breaking: బోండా ఉమ కార్యాలయం వద్దకు పోలీసులు.. ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
Breaking: బోండా ఉమ కార్యాలయం వద్దకు పోలీసులు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ సింగ్‌నగర్‌లో ఇటీవల సీఎం జగన్‌పై గులకరాయితో సతీశ్ అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో టీడీపీ నేత దుర్గారావు ఏ2 నిందితుడిగా ఉన్నారు. అయితే సతీశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కానీ దుర్గారావును ఇంకా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలోని బోండా ఉమ కార్యాలయం వద్దకు వెళ్లారు. దీంతో బోండా ఉమను అరెస్ట్ చేయడానికే వెళ్లారంటూ ప్రచారం జరిగింది. ఈ మేరకు టీడీపీ నేతలు, కార్యకర్తలు బోండా ఉమ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటనలో బోండా ఉమ సంబంధం లేదని, అధికార పార్టీ నేతలు కావాలనే ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో విజయవాడలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Read More..

జనసేన, బీజేపీ సెగ్మెంట్లలో దూసుకుపోతున్న వైసీపీ.. సైకిల్ పార్టీలో మొదలైన ఆందోళన

Next Story

Most Viewed