వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. రాజంపేట ఓటర్లకు పవన్ కీలక పిలుపు

by Disha Web Desk 16 |
వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దాం.. రాజంపేట ఓటర్లకు పవన్ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తరపున చంద్రబాబుతో కలిసి రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కొన్ని కుటుంబాల చేతుల్లో ఉన్న రాజ్యాధికారాన్ని మార్చాలన్నారు. యువతకు తలుచుకుంటే ఆ పని ఈజీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారని గుర్తు చేశారు. సారా వ్యాపారం చేసుకునే మిథున్ రెడ్డి తనను ఓడిస్తారట అని వ్యగ్యంగా విమర్శించారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిని ఎదుర్కొనే బలం యువతకు లేదా అని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యామ్‌లో ఇసుక తోడేయడం వల్ల 39 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాములు కొట్టుకుపోతున్నా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పట్టించుకోరని మండిపడ్డారు. మద్యం వ్యాపారాలు చేసుకుంటూ సంపదంతా వారి కుటుంబాల పేరుపై దాచుకుంటున్నారని ఆరోపించారు.

రాజంపేటకు పరిశ్రమలు రావాల్సి అవసరం ఉందని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. స్థానిక ముఠా నాయకులు రూ. 10 వేల కోట్లు జీఎస్టీ ఎగవేశారని చెప్పారు. ఈ ప్రాంతంలో రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని మంత్రి పెద్దిరెడ్డి పెంచి పోషించారని పవన్ వ్యాఖ్యానించారు. అంగళ్లులో చంద్రబాబుపైనే కేసులు పెట్టారని గుర్తు చేశారు. హెరిటేజ్ ను దెబ్బ తీయాలని కుట్ర చేశారని, అందులో భాగంగా రాష్ట్రానికి అమూల్‌ను తీసుకొచ్చారన్నారు. జగన్ కు క్లాస్ వార్ పై మాట్లాడే హక్కే లేదని చెప్పారు. యువకు ఉపాధి కావాలంటే కూటమికి ఓటు వేయాలన్నారు. సోమశిల బ్యాక్ వాటర్స్ ప్రాంతాన్ని పర్యాటకం పరంగా డెవలప్ మెంట్ చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఒంటిమిట్లను టెంపుల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కోస్తా ఏరియాలో వైసీపీకి ఒక్క సీటు సైతం రాదని, రాయలసీమలోనూ ఆ పార్టీని తుడిచిపెట్టేయాలని పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.



Next Story

Most Viewed