21 మంది ఎమ్మెల్యేలతో 21వ తేదీన.. జనసేన అరుదైన ఫీట్ నెట్టింట వైరల్

by Rajesh |   ( Updated:2024-06-21 11:48:09.0  )
21 మంది ఎమ్మెల్యేలతో 21వ తేదీన.. జనసేన అరుదైన ఫీట్ నెట్టింట వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పాలిటిక్స్‌లో జనసేన ఒక్కసారిగా కింగ్ మేకర్ అయిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా కూటమి అధికారంలోకి రావడంలో ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయన ప్రాధాన్యతను గుర్తించిన సీఎం చంద్రబాబు పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. కాగా, నేడు ఏపీ అసెంబ్లీలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 21 ఎమ్మెల్యే స్థానాలు పొందినప్పుడు పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు సీఎం అంటుంటే కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని సీఎం ఎలా అవుతారని వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ను హేళన చేశారు. అయితే తాజాగా అసెంబ్లీ శుక్రవారం 21 తేదీన తీసుకున్న 21 సీట్లన్నీ గెలిచి 21 మంది ఎమ్మెల్యేలతో 21 వ తారీఖునే అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగుపెట్టారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇక, ప్రధాని మోడీ సైతం ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశంలో పవన్ ను ప్రత్యేకంగా అభినందించిన విషయం తెలిసిందే. పవన్ అంటే తుఫాన్ అని ప్రధాని అనడంతో ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Advertisement

Next Story

Most Viewed