ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

by Mahesh |   ( Updated:2024-01-04 05:39:23.0  )
ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు ‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగదాం మండలం దవళ పేటలో కంచరానా అసిరి నాయుడు కుటుంబాన్ని, ఆముదాలవలస నియోజకవర్గంలోని గొర్ల తిరుపతిరావు, ఆకేటి పాపయ్య, గేదెల సాంబమూర్తి కుటుంబాలను, భామిని మండలం బెల్లమడ గ్రామానికి చెందిన బర్రి విశ్వనాథం కుటుంబాన్ని భువనేశ్వరి కలిసి మాట్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed