ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన పాపం కిరణ్ కుమార్ రెడ్డిదే: MP మిథున్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన పాపం కిరణ్ కుమార్ రెడ్డిదే: MP మిథున్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ పక్కా ప్రచారం హోరెత్తిస్తోన్న పొలిటిషియన్స్ మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. నేతల పోటాపోటీ డైలాగ్ వార్‌తో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వెదర్ సమ్మర్ హీట్‌ను తలపిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టిన పాపం కిరణ్ కుమార్ రెడ్డిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విజభన జరిగినతర్వాత పదేళ్లలో కిరణ్ కుమార్ రెడ్డి పది మంది పేదలకు కూడా సహయం చేయలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రా కేఏ పాల్ అని సెటైర్ వేశారు. ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారని ఆరోపించారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల రోజున కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోతాడని అన్నారు.



Next Story

Most Viewed