‘ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరిస్తాం’.. మంత్రి నారా లోకేష్ కీలక హామీ

by Jakkula Mamatha |
‘ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరిస్తాం’.. మంత్రి నారా లోకేష్ కీలక హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ట్రిపుల్ ఐటీలలో అన్ని సమస్యలు పరిష్కరించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత నాది అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో విజయవాడ వరద బాధితులకు 1565 మంది నూజివీడు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు యోగా గురువు శ్రీధర్ ఆధ్వర్యంలో రూ.2,82,313 విరాళంగా అందజేశారు. బాధితులకు ఇంతమంది అండగా నిలవడం చాలా గొప్ప విషయం. నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు హామీ ఇస్తున్నాను. అన్ని సమస్యలు పరిష్కరించి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత నాది అని మంత్రి లోకేష్ తెలిపారు.

Next Story

Most Viewed