జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పనున్న మంత్రి నాదెండ్ల

by Satheesh |
జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పనున్న మంత్రి నాదెండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ ఎమ్మెల్యేల భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 25వ తేదీన జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది జనసేన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని జనసేన హై కమాండ్ నిర్ణయించింది. శాసన సభ నిబంధనలు, సంప్రదాయాలు, ప్రసంగాలపై కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్‌లు చెప్పనున్నారు. సభలో ఏ విధంగా వ్యవహరించాలన్న వివిధ అంశాలను ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆఫీస్‌లో ఈ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించనున్నారు. గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసిన ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్, గతంలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story

Most Viewed