లోకేష్ ఆరోపణలు.. తిరుమలేశుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం

by Rajesh |
లోకేష్ ఆరోపణలు.. తిరుమలేశుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేత నారా లోకేష్, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా యువగళం పాదయాత్రలో టీడీపీ నేత లోకేష్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ నెల్లూరు నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని తిరుమలేశుని సన్నిధిలో శుక్రవారం ప్రమాణం చేశారు. రూ. వెయ్యి కోట్లు ఉన్నాయని లోకేష్ ఆరోపించారని అనిల్ అన్నారు. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి కేవలం రూ.10 కోట్ల ఆస్తి మాత్రమే ఉందన్నారు. లే ఔట్లతో తనకేలాంటా సంబంధం లేదన్నారు. లోకేష్‌ను ప్రమాణం చేయడానికి పిలిచినా రాలేదన్నారు. లోకేష్ చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే బుచ్చిరెడ్డి పాలెం బస్టాండ్‌లో ఉరి వేసుకుంటా అన్నారు.

Next Story

Most Viewed