- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > Breaking: మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి.. కారుపై రాళ్లు రువ్విన దుండగులు
Breaking: మంత్రి ఫరూక్ కుమారుడిపై దాడి.. కారుపై రాళ్లు రువ్విన దుండగులు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఫరూక్ కుమారుడు ఫిరోజ్(Minister FarooQ Son Feroze)పై దాడి జరిగింది. నంద్యాల టీడీపీ కార్యాలయం (Nandyal Tdp Office) నుంచి ఆయన కారులో వెళ్తుండగా నలుగురు యువకులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. కారులో నుంచి దుండగలను పట్టుకునేందుకు ఫిరోజ్, ఆయన అచరులు ప్రయత్నం చేశారు. మణికంఠరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పారిపోయారు. పట్టుకున్న వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఫిరోజ్పై దాడికి గల కారణాలను పోలీసులు రాబడుతున్నారు. అయితే కావాలనే ఫిరోజ్పై దాడి చేశారని అనుచరులు అంటున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Advertisement
Next Story