Shocking: తెల్లవారితే పెళ్లి.. అంతలోనే పెళ్లికూతురు జంప్‌

by srinivas |
Shocking: తెల్లవారితే పెళ్లి.. అంతలోనే పెళ్లికూతురు జంప్‌
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి కుదిరింది. ముహూర్తం పెట్టుకున్నారు. వివాహం తేదీ వచ్చింది. కల్యాణమండపం బుక్ చేసుకున్నారు. అందంగా అలంకరించారు. అంతా పెళ్లి పనుల్లో తేలిపోయారు. తెల్లవారితే వివాహం జరిగిపోతుందిలే అనుకున్నారు. ఇంతలో పెళ్లి కూతురు భారీ షాక్ ఇచ్చింది. ప్రియుడుతో కలిసి జంప్ అయింది. ఈ ఘటన క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ‌(Kurnool District Pattikonda)లో జరిగింది.

పత్తికొండకు చెందిన తల్లిదండ్రులు (Parents).. తన కూతురుకి అబ్బాయిని చూసి పెళ్లి(wedding) నిశ్చయించారు. బంధువులకు లగ్న పత్రికలు పంచుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం తేదీ రానే వచ్చింది. దీంతో కల్యాణమండపం(Kalyanamandapam) బుక్ చేసుకుని పెళ్లి కూతురుని తీసుకుని బంధువులతో కలిసి వెళ్లారు. అయితే తెల్లవారితే కూతురు పెళ్లి అయిపోతుందని, ఉదయాన్నే త్వరగా లేవాలని కల్యాణ్ మండపంలో నిద్రపోయారు. దీంతో పెళ్లికూతురు(Bride) తన ప్రియుడి(Boyfriend)కి ఫోన్ చేశారు. వెంటనే అతను స్నేహితుడితో కలిసి వచ్చారు. ఈ మేరకు క‌ల్యాణ‌మండ‌పం నుంచి తెల్లవారుజామున‌ ప్రియుడితో కలిసి బైక్‌పై పెళ్ళికూతురు పారిపోయారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. కూతురు పెళ్లి నిలిచిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే కల్యాణ మండపం నుంచి పెళ్లి కూతురు వెళ్లి పోతున్న దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story