కానూరులో కారు బీభత్సం.. ఐదుగురు యువకులు?

by Y.Nagarani |
కానూరులో కారు బీభత్సం.. ఐదుగురు యువకులు?
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలోని కానూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న షాపుల్లోకి కారు దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులుండగా.. వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారునడిపిన సమయంలో యువకులు మద్యం సేవించి ఉన్నారా ? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా ? ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed