- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
క్వారీలో ఘోరం.. అనంతలోకాలకు అక్కాచెల్లెళ్లు
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో పొద్దున్నే ఘోరం జరిగింది. దోనబండ క్వారీలో అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ప్రమాదవ శాత్తు నీటి గుంతలో పడ్డారు. కొద్ది సేపటికే నీటిలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడక కన్నుమూశారు. మృతులు లక్ష్మీజానీ (15), జానీ రాధ (14)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీశారు. క్వారీలో పని చేస్తున్న వారి నుంచి మృతుల వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగిందా..?.. మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
అయితే అక్కాచెల్లెళ్లుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులను ఎవరూ ఓదర్చలేకపోతున్నారు. ఎప్పుడూ చలాకీగా కనిపించే అక్కాచెల్లెళ్లు ఇక లేకపోవడంతో స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.