మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరం: సీఎం చంద్రబాబు

by Mahesh |
మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరం: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. ఈ ఘటన యావత్ జిల్లాను విషాదంలోకి నెట్టివేసింది. మృతులు గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు ఉండ‌గా, వారి ఇద్దరు కుమార్తెలైన‌ పవిత్ర (16), గురులక్ష్మి(10)లుగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం బాధాకరం, తల్లిదండ్రులు కోల్పోయిన బాలిక బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వం తరఫున బాలికకు రూ.10 లక్షల సహాయం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ ఘటనపై నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా. బైరెడ్డి శబరి స్పందించారు.. ఈ ఘటన అందరిని కలిచివేసింది.. కుటుంబాన్ని పోగొట్టుకున్న ప్రసన్న చదువు బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం అందించేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు ఎంపీ శబరి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed