Heavy Rains: ఏలూరు జిల్లాలో వరద విధ్వంసం... భారీగా నష్టం

by srinivas |
Heavy Rains: ఏలూరు జిల్లాలో వరద విధ్వంసం... భారీగా నష్టం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షానికి పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో ఈ వరద నీరు ఏల్లూరు జిల్లా వేలేరుపాడు మండలంలో బీభత్సం సృష్టించింది. వరద ఉధృతికి ఇల్లు కూలిపోయాయి. పంటల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లన్నీ కూలిపోయాయి. వరదలో పశువులు సైతం కొట్టుకుపోయాయి. రోడ్లు తెగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో సామన్లు మొత్తం పాడైపోయాయి. వేలాది ఎకరాల పొలాల్లో వరద నీళ్లు చేరడంతో పూర్తిగా నాశనం అయ్యాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీళ్లు సైతం దొరకడం లేదు. ఎటు చూసిన కొట్టుకుపోయిన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయ కలుగుతోంది. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. అన్నం వండుకునేందుకు సైతం పొడి స్థలం లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు ఇవ్వాలని కోరుతున్నారు.



Next Story