Ap News: ఊరికో సైకో తయారయ్యాడు!

by srinivas |
Ap News: ఊరికో సైకో తయారయ్యాడు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్రవాదులు, ఫ్యాక్షనిస్టులు, మత ఘర్షణలను అణిచివేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఊరికో సైకో తయారు అయ్యాడని ఆయన మండిపడ్డారు. ఆవేదనతో ఎవరైనా వైసీపీ నేతలు నిజం మాట్టాడితే వారిపై దాడులు, కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎంపీ రఘురామ రాజును, సుబ్బారావు గుప్తాను ఎలా వేధించారో చూశామన్నారు. బ్రిటిష్ వాళ్లు కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ అధికారి సునీల్ కుమార్ ఎన్ని దారుణాలు చేసారో చూశామన్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకురాలేకపోయారని విమర్శించారు. ప్రజలు దశాబ్దాల పాటు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను బెదిరించి ఆస్తులు రాయించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక్క విశాఖలోనే 40 వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Next Story

Most Viewed