గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు.. అయ్యా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్ అంటూ ఫైర్

by Kavitha |   ( Updated:2024-08-31 15:08:18.0  )
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు.. అయ్యా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్ అంటూ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశం ప్రస్తుతం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి.. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు.

ఇదిలా ఉంటే.. ఏమీ జరగలేదంటూ ఎస్పీ చేసిన ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. వర్షంలో తడుస్తూనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు.. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ‘’వి వాంట్ జస్టిస్” అంటూ ధర్నా చేస్తున్నారు. వారం నుంచి చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు.. ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడతామంటున్నారని వాపోతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన మహిళలు దీనిని తీవ్రంగా ఖండిస్తూ న్యాయం చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఓ మహిళ మాట్లాడుతూ.. "మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు. ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఎస్పీ గారు ఏమి జరగలేదు అని అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదు. ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఆడపిల్లలు ఎలా బయటకు వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు. అతను బయటకు రావాలి. ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి" అంటూ డిమాండ్ చేస్తున్నారు.

For Video : https://x.com/TeluguScribe/status/1829504937287680325

Advertisement

Next Story

Most Viewed