సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం : సీఎం జగన్

by Rajesh |
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం : సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం అన్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో ఉండనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే నా తపన అన్నారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై తనపై చీకటి యుద్ధం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెత్తం దార్లకు పేదల పక్షాన నిల్చున్న తనకు యుద్ధం జరుగుతుందన్నారు. తోడేళ్లన్నీ ఏకమైనా తనకు భయం లేదన్నారు.

Next Story

Most Viewed