మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్..ప్రధాన అనుచరులు మూకుమ్మడి రాజీనామా

by srinivas |   ( Updated:2024-07-12 10:38:49.0  )
మాజీ మంత్రి పెద్దిరెడ్డికి భారీ షాక్..ప్రధాన అనుచరులు మూకుమ్మడి రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పెడ్డిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరులు ముకుమ్మడి రాజీనామా చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచారు. గతంలో మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో నియోజకవర్గంలోనే కాకుండా పెద్దిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా హవా కొనసాగింది. ప్రతిపక్షాన్ని అయితే ఒక ఆట ఆడుకున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయించారు. 2019 ఎన్నికలో 151 సీట్లతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో పెద్దిరెడ్డి సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకే వెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో పెద్దిరెడ్డి తన పని చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అనుచరులంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారం కోల్పోవడంతో అనుచరులంతా తలో దారి చూసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

తాజాగా పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పీటీసీ మురళీధరన్ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మరికొందరు నడిచారు. ఇద్దరు పులిచెర్ల వైఎస్ ఎంపీపీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. మరో ఎంపీటీసీలు, ఏడుగురు సర్పంచులు సైతం వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయంలో రాజీనామాలు సమర్పించారు. పార్టీతో పదవులకూ గుడ్ బై చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed