Tirumala Laddu: సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కాకాణి

by Mahesh |
Tirumala Laddu: సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కాకాణి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ (Adulteration of Laddu) వివాదంపై మంత్రి సుబ్రహ్మణ్యస్వామి (Subrahmanya swamy) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసిన విషయం తెలిసిందే. కాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి కాకాణి (Former minister Kakani) స్పందించారు. తిరుమల లడ్డూను చంద్రబాబు వివాదం చేసి.. ఎందరో భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. సనాతన ధర్మంపై పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా మారిందని, టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం భావ్యం కాదని, మేం చెప్పిన విషయాలతో సుప్రీం ఏకీభవించినట్టుందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed