Ongole: నోటీసులపై స్పందించిన చెవిరెడ్డి

by srinivas |   ( Updated:2025-03-12 07:01:51.0  )
Ongole: నోటీసులపై స్పందించిన చెవిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంచార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chevireddy Bhaskar Reddy)కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒంగోలు(Ongole)లో యువత పోరు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్న ఆయనకు పోలీసులు 41-ఏ నోటీసులు అందజేశారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని సూచించారు. దీంతో ఈ నోటీసులపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేసులు పెట్టి వైసీపీ నేతలను అణచివేయాలని టీడీపీ(Tdp) నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీడీపీ పాలించిన సమయంలోనూ తనపై 88 కేసులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా 5 కేసులు నమోదు చేశారని చెప్పారు. ఉద్యమాలు, పోరాటాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) పుట్టిందని, కేసులకు భయపడమన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని, చేస్తూనే ఉంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed