Nallari Kiran Kumar Reddy : అమిత్ షాను కలిసిన మాజీ సీఎం

by M.Rajitha |
Nallari Kiran Kumar Reddy : అమిత్ షాను కలిసిన మాజీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith sha)తో శుక్రవారం సమావేశమయ్యారు. అన్నమయ్య జిల్లాలోని కలికిరి వద్ద ఉన్న ఐటీబీపి, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్స్ లలో సౌకర్యాలు మెరుగు పర్చాలని కిరణ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. మూడు కేంద్ర బలగాలకు ఒకేచోట శిక్షణ ఇస్తున్నారని, అలా కాకుండా విడివిడిగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ శిక్షణా కేంద్రాలకు అనుబంధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, ప్రత్యేక సైనిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. కాగా వీటిపై హోం శాఖ మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed