- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తారకరత్న మృతి టీడీపీకి తీరనిలోటు: Arimilli Radhakrishna
by srinivas |

X
దిశ, తణుకు: నందమూరి తారకరత్న మృతి పట్ల తణుకు టీడీపీ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సంతాపం తెలిపారు. తారక రత్న ఒకే రోజు 9 సినిమాలను ప్రారంభించి ప్రపంచ స్థాయిలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. సినీ రంగంలో తారకరత్న ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని కొనియాడారు. 20 సినిమాల్లో నటించి, అమరావతి సినిమాకు నంది అవార్డును అందుకుని ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. తారకరత్న మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. కేవలం నటుడు గానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి నందమూరి తారకరత్న అని అన్నారు. సమాజ సేవ చేయాలని రాజకీయాల్లోకి ప్రవేశించిన తరుణంలో దురదృష్టకరమైన సంఘటన జరగటం బాధాకరమని ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు.
Next Story