జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్..

by Sumithra |   ( Updated:2025-03-26 03:14:11.0  )
జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్..
X

దిశ, నందిపేట్ : నందిపేట్ మండల కేంద్రంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నందిపేట్ మండలంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో గల కుల, మతం భేదం లేకుండా ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. DCCB చైర్మన్ రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ నిజామాబాద్ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్, నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, నిజాంబాద్ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ సుదర్శన్ , PACS చైర్మన్ గంగారెడ్డి, పిప్రి సాయి రెడ్డి, లింగన్న, రాజేందర్, వెల్మల్ గోపి, మోహన్ రావు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Next Story