Breaking: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పాత విధానంలోనే ఈ-మీటింగ్

by srinivas |
Breaking: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పాత విధానంలోనే ఈ-మీటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ ప్రత్యక్షంగా కాదు. ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ-కేబినెట్ భేటీ విధానాన్ని రేపటి నుంచి మళ్లీ నిర్వహించనున్నారు. ఈ విధానంలో అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకూ అన్ని ఆన్‌లైన్ ద్వారానే అందజేయనున్నారు. 2014-19లో ఈ-కేబినెట్ విధానాన్ని నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే విధానంలోనే మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. పేపర్ లెస్ కేబినెట్ కు సంబంధించిన ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ సైతం ఇచ్చింది. ఈ కేబినెట్‌ వల్ల కలిగే ఉపయోగాలను సైతం వారికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ వివరించారు. ఈ విధానం వల్ల సమాచారన్ని పూర్తిగా సీక్రెట్‌గా ఉంచొచ్చని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ర్టానిక్ కేబినెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.

Advertisement

Next Story