Tirumala Updates:తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Jakkula Mamatha |
Tirumala Updates:తిరుమలలో భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం శ్రీవారిని 79,313 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 39,344 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఆన్‌లైన్‌లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేస్తారు.

Advertisement

Next Story

Most Viewed