AP Politics:జగన్‌పై దాడిని టీడీపీకి ఆపాదించే కుట్ర: టీడీపీ నేత

by Disha Web Desk 18 |
AP Politics:జగన్‌పై దాడిని టీడీపీకి ఆపాదించే కుట్ర: టీడీపీ నేత
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికల వేళ అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి పై జరిగిన రాళ్ల దాడి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఎట్టకేలకు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు స్పందిస్తూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై దాడిని టీడీపీకి ఆపాదించే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కావాలనే టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మాజీ మంత్రి వెల్లంపల్లి కాలికి గాయం అయితే..కంటికి కట్టు కట్టుకున్నారు. ఆయనకు దమ్ముంటే పబ్లిక్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. సానుభూతి రాజకీయాల కోసమే సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారు అని మండిపడ్డారు.

Next Story

Most Viewed