వైసీపీ స్టార్ క్యాంపెయినర్లను రివీల్ చేసిన జగన్.. ఆ మూడు ఛానళ్లపై సీరియస్ కామెంట్స్

by GSrikanth |
వైసీపీ స్టార్ క్యాంపెయినర్లను రివీల్ చేసిన జగన్.. ఆ మూడు ఛానళ్లపై సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నాలుగో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఉరవకొండ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎక్కడా జరుగని విధంగా మహిళల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. లంచాలకు తావులేకుండా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అభివృద్ధిని చూసి కూడా కొందరు కుట్ర పూరితంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు దోచుకోవడం.. దాచుకోవడం అనే రీతిలో ఉండేవని తెలిపారు. అలాంటి వారు కూడా మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

గజదొంగల ముఠాను వెంటేసుకొని ప్రభుత్వంపై చంద్రబాబు అదేపనిగా విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. వీరికి తోడు దత్తపుత్రుడు కూడా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఇలా చెప్పుకుంటే అనేకమంది చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నాయని సీరియస్ కామెంట్స్ చేశారు. వాళ్ల కంటే ఎక్కువ మంది తనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలే, ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న అందరూ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లే అని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed