Breaking: ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

by srinivas |
Breaking: ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వరాజ్ మైదానంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 18 ఎకరాల్లో సృతివనం ఏర్పాటు చేసి అందులో 206 అడుగులున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌గా వినియోగించున్నారు. ఇక అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. పీఠం 81 అడుగుల ఉంది. రూ. 404 కోట్లతో విగ్రహాన్ని నిర్మించారు. విగ్రహం తయారీకి 400 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడారు. 120 మెట్రిక్ టన్నుల క్యాంసం వినియోగించారు. విగ్రహం పీఠానికి పింక్ ఇసుక రాయితో తాపడం చేయించారు. అలాగే రెండు వేల మంది కూర్చునేల కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ ఏరియా, మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను కూడా ఏర్పాటు చేశారు. విగ్రహం బేస్‌లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు నిర్మించారు. ఒక్కో హాలు విస్తీర్ణం 4వేల చదరపు అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం ఆవిష్కరణలో భాగంగా విజయవాడలో రాత్రి 12 గంటలకు వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు.

Advertisement

Next Story

Most Viewed