CM Chandrababu:వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం

by Jakkula Mamatha |
CM Chandrababu:వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
X

దిశ,వెబ్‌డెస్క్:ఈ రోజు (సెప్టెంబరు 7) వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలుగు ప్రజలకు విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఈ సమయానికి వాడవాడలా వినాయక మండపాలతో కళకళలాడాల్సి ఉండేది. కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరద(Floods)లు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు(Disasters) రాకుండా చూడాలని ఆ గణపయ్యను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed