నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-09-13 09:55:46.0  )
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు(శుక్రవారం) సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న(గురువారం) కమ్యూనిస్టు పార్టీ దిగ్గజ నాయకుడు, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు సీతారం ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ క్రమంలో నేడు సీఎం చంద్రబాబు సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులు ఆర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి, రేపు ఉదయం హైదరాబాద్‌కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షంచనున్న సీఎం చంద్రబాబు, ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.

Advertisement

Next Story

Most Viewed