- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ కుటుంబాలను ఆదుకుంటాం.. సీఎం చంద్రబాబు భరోసా
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా ముప్పాళ్ల(Muppalla)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్(Tractor) బోల్తా పడింది. గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మ అనే నలుగురు మహిళలు మృతి చెందారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర విచారకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Next Story