'గుడ్లవల్లేరు' ఘటనపై 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు నాయుడు

by M.Rajitha |
గుడ్లవల్లేరు ఘటనపై 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వండి : సీఎం చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై స్వయంగా సమీక్షిస్తున్న సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎస్పీని అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కాలేజీకి వెళ్లాలని జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ కేసులో జరుగుతున్న విచారణను ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు నివేదించాలని సూచించారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని స్పష్టం చేశారు. మన వాళ్ళకు కష్టం వస్తే ఎలా స్పందిస్తారో.. అంతే వేగంగా విచారణ జరిపి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ఉదయం నుండి విద్యార్థినిలు కాలేజీ ఆవరణలో ధర్నా చేస్తున్నారు.

Next Story