CM Chandrababu:నేడు టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-25 15:15:38.0  )
CM Chandrababu:నేడు టీటీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ..కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో నేడు (ఆదివారం) తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈరోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని చెప్పారు.

Advertisement

Next Story