- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
నేడు నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాలపై చర్చలు
X
దిశ,వెబ్డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు నేడు (మంగళవారం) నీతి ఆయోగ్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు సచివాలయానికి రానున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఈరోజు సీఎం చంద్రబాబు చర్చలు జరుపనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సమీక్ష ఉంటుంది. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో ప్రణాళిక శాఖ సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని భావిస్తున్నారు. అలాగే దేవదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Advertisement
Next Story