- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సీఎం జగన్ లండన్ పర్యటన అందుకేనా?
- జగన్ విదేశీ పర్యటనపై అప్పుడే సెటైర్లు
- తిరిగి వస్తాడా? రాడా? అంటూ ప్రశ్నలు
- విజయ్ మాల్యాలా ఉండిపోతారని సోషల్ మీడియాలో వైరల్
- అనుమానం వ్యక్తం చేసిన చెల్లెలు షర్మిల
దిశ, ప్రతినిధి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ దంపతులు పోలింగ్ ముగిసిన తర్వాత మే నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కుమార్తెల దగ్గరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరారు. ఇలా వారు కోర్టులో పిటిషన్ వేశారో లేదో అప్పుడే అది సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. జగనన్న లండన్ నుంచి తిరిగి వస్తారా రారా అంటూ పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది.
అనుమానాలు పెంచిన షర్మిల వ్యాఖ్యలు..
స్వయానా చెల్లెలు అయిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్న జగన్ లండన్ పర్యటన పట్ల అనుమానం వ్యక్తం చేశారు. పాస్ పోర్టులు సిద్ధం చేసుకుని అన్న జగన్ లండన్ వెళ్తున్నాడు అంటే ఇక తిరిగి రాడేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. అరెస్టు భయంతో వెళుతున్నాడు అంటూ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
విజయ్ మాల్యాలా ఉండిపోతారా ..
జగన్ కూడా లండన్ వెళ్లి విజయ్ మాల్యా లా ఉండిపోతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు . పార్టీ ఓడిపోతే తిరిగి ఆంధ్రప్రదేశ్కు రారంటూ అప్పుడే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పోలింగ్ ముగియక ముందే జగన్ అనుమతి కోరారు. అంటే గెలుపుపై నమ్మకం లేదనేది అర్థమవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ నాయకుల్లో కలవరం
జగన్ లండన్ పర్యటన ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ముఖ్య నాయకులను కూడా కలవరపరుస్తోంది. ఈ సమయంలో ఆయన వెళ్ళడం మంచి పరిణామం కాదని పోలింగ్కు ముందే ఈ వార్త బయటకు రావడం వల్ల ఎన్నికల్లో పాల్గొనాల్సిన కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని సందేహిస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత జగన్ ఎక్కడికి వెళ్లినా ఇబ్బంది ఉండదని, ముందు దరఖాస్తు చేయడం పార్టీకి నష్టమని అభిప్రాయపడుతున్నారు.