Breaking News: అక్రమార్కులను జైలుకు పంపుతాం.. వైసీపీ పై చంద్రబాబు ఫైర్

by Indraja |
Breaking News: అక్రమార్కులను జైలుకు పంపుతాం.. వైసీపీ పై చంద్రబాబు ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో విధుల్లో భాగమైన అధికారులు చట్టబద్ధంగా విధులు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఇక వైసీపీ అధికారం లోకి వచ్చాక అవనీతి పెరిగిందని ఆరోపించిన ఆయన.. జగన్ ప్రభుత్వ పాలనలో అడ్డుఅదుపు లేకుండా ఓటర్ లిస్ట్ మారుస్తున్నారని.. భాద్యతాయుత పదవిలో ఉండి ఇలా భాద్యతారాహిత్యంగా పర్వర్తించడం వైసీపీకే సాధ్యమని మండిపడ్డారు. ఇలా అక్రమాలకూ పాల్పడే అక్రమార్కులను తెలుగుదేశం పార్టీ విడిచి పెట్టదని.. కచ్చితంగా జైలుకు పంపుతామని ఆగ్రహం వ్యక్తం చేసారు.

పులవర్తి నాని అనే వ్యక్తి దొంగ ఓట్లు తొలగించాలని చంద్రగిరిలో ఆందోళనకు దిగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆత్మహత్యకు యత్నించి అనారోగ్యం పాలైన పులవర్తి నానిని చంద్రబాబు పరామర్శించారు. అనంతరం దొంగ ఓట్లు చేర్పించి తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ మండిపడ్డా.. చంద్రగిరిలో అవకతవకలపై తిరుపతి కలెక్టర్‌కు ఈసీ చీవాట్లు పెట్టిన వెసీపీ నాయకుల్లో మార్పు మాత్రం రాలేదన్నారు. అయితే అక్రమాలకు పాలపడితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఉపేక్షించదని.. అవినీతికి పాల్పడే అక్రమార్కులను జైలుకు పంపిస్తామని వైసీపీ పై నిప్పులు చెరిగారు.

Advertisement

Next Story

Most Viewed