ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు

by M.Rajitha |
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన రూ.15 వేల కోట్ల నిధులు సమకూర్చే పనిలో భాగంగా.. మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. ఈ నిధులతో అమరావతి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా ఈ నెల 27 వరకు బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో పర్యటిస్తారు. ఈ సమావేశంలో చంద్రబాబుతోపాటు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం, అభివృద్ది గురించి మరోసారి మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు విడిగా సమావేశం కానున్నట్టు సమాచారం.

Next Story

Most Viewed