కడపలో ప్రజాగళం.. జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం

by Disha Web Desk 16 |
కడపలో ప్రజాగళం.. జగన్‌పై చంద్రబాబు ప్రశ్నల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: కడపలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాను కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. అయితే దానికి సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు. రాయలసీమ ద్రోహి జగన్ అని, అలాంటి వ్యక్తి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. నవ్యాంధ్రను అభివృద్ధి చేసే వరకూ వదిలిపెట్టనని చెప్పారు. జగన్‌ ఒక సైకో అని.. ఆయనకు ఎవరినీ గౌరవించారని మండిపడ్డారు. కన్నతల్లికి కూడా తిండి పెట్టలేని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు తెలిసిందల్లా దోచుకోవడమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

Next Story

Most Viewed