సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని వినతి

by Mahesh |
సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని వినతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కేంద్ర బృందం భేటీ అయింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు, వాటి వల్ల ఏర్పడ్డ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రెండో సారి ఏపీకి వచ్చింది. ఇందులో భాగంగా బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాలో కేంద్ర అధికారులు పర్యటించారు. అలాగే గురువారం మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అమరావతిలోని సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదిక, జరిగిన నష్టంపై.. కేంద్ర బృందానికి మరోసారి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని సీఎం చంద్రబాబు కేంద్ర అధికారులను కోరారు.

Advertisement

Next Story

Most Viewed