- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం భేటీ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని వినతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కేంద్ర బృందం భేటీ అయింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదలు, వాటి వల్ల ఏర్పడ్డ నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం రెండో సారి ఏపీకి వచ్చింది. ఇందులో భాగంగా బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాలో కేంద్ర అధికారులు పర్యటించారు. అలాగే గురువారం మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అమరావతిలోని సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదిక, జరిగిన నష్టంపై.. కేంద్ర బృందానికి మరోసారి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని సీఎం చంద్రబాబు కేంద్ర అధికారులను కోరారు.
Advertisement
Next Story