Breaking:‘పోలవరం’ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం

by Jakkula Mamatha |
Breaking:‘పోలవరం’ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధుల గురించి కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నేడు(సోమవారం) పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి.



Next Story