- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Breaking : యాంకర్ సుమ యాడ్ ఇవ్వడం వల్లే మోసపోయాం.. రాకీ అవెన్యూస్ సంస్థ వద్ద బాధితుల ఆందోళన
దిశ, వెబ్డెస్క్ : రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి.మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేస్తామని 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది.అపార్టుమెంట్లు నిర్మాణం చేసి ఫ్లాట్ లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. రాకీ అవెన్యూస్ బోర్డు తిప్పేయడంతో వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో తమకు న్యాయం చేయాలనీ బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాజాగా .. ఈ విషయం బయటపడటంతో ఆ సంస్థ చైర్మన్ రామయ్య వేణు పరారీలో ఉన్నారు.
ఈ క్రమంలో బాధితుడు ఓ మీడియాతో మాట్లాడూతూ... 'రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్ వన్ బిల్డింగ్స్ చూశానని, ఫేజ్ 2 కూడా త్వరలో కడుతామని సుమతో ప్రచారం చేయించడం వల్లే ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చానని తెలిపారు. తాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లు నాలుగు తీసుకొని ఒక్కొక్క ఫ్లాట్ కు 25 లక్షల ధర చెల్లించి మొత్తంగా కోటి రూపాయల వరకు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేయించానని' తెలిపారు.కాగా.. ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. కేవలం 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి.దీంతో సుమపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కేవలం రెమ్యూనరేషన్ తీసుకుంటే చాలా..?జనం మోసపోయిన పర్వాలేదా..? అనే ప్రశ్నలకు సుమ సమాధానం చెప్పాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే .. ఈ యాడ్స్ లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా నటించారు.