BREAKING: ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల కలకలం..

by Anjali |
BREAKING: ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరాల కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో అర్ధరాత్రి ఉత్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారన్న ఓ వార్త సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. విజయ్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విజయ్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వారం క్రితమే వెలుగుచూసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇక రీసెంట్‌గానే శంషాబాద్‌లోని ఓయో హోటల్‌ గదిలో సీక్రెట్‌గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెంట్‌కున్న వ్యక్తుల అశ్లీల వీడియోలను సీసీ కెమెరాలో బంధించి.. బాధితులను హోటల్ నిర్వాహకుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story