ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్.. బీజేపీ నేత పాతూరి కీలక వ్యాఖ్యలు

by srinivas |
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్.. బీజేపీ నేత పాతూరి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సీఎం అభ్యర్థి బీజేపీ వ్యక్తే ఉండాలని, తాము ఇంకో పార్టీ కింద పని చేయమని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్న విషయం తెలిసిందే. అయితే విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పాతూరి నాగభూషణం స్పందించారు. విష్ణువర్థన్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పొత్తులపై బీజేపీ నాయకత్వానిదే తుది నిర్ణయమని నాగభూషణం తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు తమ స్థాయిలో నిర్ణయాలు ఉండవని చెప్పారు. పొత్తులపై తమ అధినేత్రి పురంధేశ్వరి ఎప్పుడో చెప్పారని పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పురంధేశ్వరి అధ్యక్షురాలైన తర్వాత పార్టీ బలపడిందన్నారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ప్రభుత్వం తప్పిదాలపై పోరాటం చేస్తున్నామని పాతూరి నాగభూషణం వెల్లడించారు.

Advertisement

Next Story