బీజేపీ మరో కీలక నిర్ణయం.. మాజీ ఆర్మీ జవాన్‌కు ఎమ్మెల్యే టికెట్

by Disha Web Desk 12 |
బీజేపీ మరో కీలక నిర్ణయం.. మాజీ ఆర్మీ జవాన్‌కు ఎమ్మెల్యే టికెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా.. 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఇందులో భాగంగా.. బుధవారం సాయంత్రం తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా భారత మాతకు ఏళ్ల తరబడి సేవ చేసిన మాజీ ఆర్మీ జవాన్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇయన సుదీర్ఘకాలం ఆర్మీలో ఉండి.. రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరారు. 2021లో ఇచ్చవోలు బీజేపీ మండల అధ్యక్షుడిగా, 2022లో రాజమండ్రి మీడియా ఇంచార్జ్ గా.. 2022 నుంచి ఇప్పటి వరకు అన్నపర్తి అసెంబ్లీ కన్వినర్‌గా ఉన్నారు. కాగా 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి అవకాశం రాగా.. వచ్చిన అవకాశాన్ని కూడా ఆ పార్టీ మాజీ ఆర్మీ జవాన్ అయిన ఎం. శివ కృష్ణంరాజుకు ఇచ్చింది.


Next Story

Most Viewed