- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
AP News:వరద బాధితులకు బిగ్ రిలీఫ్..ప్రభుత్వం కీలక నిర్ణయం
దిశ,వెబ్డెస్క్:ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడను వరద నీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 179 సచివాలయాల పరిధిలోని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అయితే నేటి నుంచి వరద బాధితులకు సాయంగా ముంపునకు గురైన వరద ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసర సరుకులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యి MDU రేషన్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలును ప్రభుత్వం అందజేస్తోంది. నిన్న(గురువారం) మంత్రి మనోహర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నేడు(శుక్రవారం) పంపిణీ వ్యవస్థను పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీరపాండ్యన్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ..వరదల్లో చిక్కుకున్న వారికి నిన్నటి వరకు ఆహారం, నీళ్లు, పాలు ప్రభుత్వం అందజేసిందన్నారు. అయితే ఈ సరుకులను రేషన్ కార్డులో పేరును బట్టి వేలిముద్రల ఆధారంగా అందజేస్తామన్నారు. ఇక రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ఆధారంగా అందిస్తామన్నారు. మూడు నాలుగు రోజుల పాటు ఈ పంపిణీ జరుగుతుందని తెలిపారు.