- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Breaking: టీడీపీ అభ్యర్థి కంపెనీలో సోదాలు.. భారీగా నగదు ఉన్నట్లు సమాచారం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. వాహనాలతో పాటు అనుమానం వచ్చిన కంపెనీల్లోనూ సోదాలు చేస్తున్నారు. తాజాగా బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. చీరాల మండలం కావూరివారిపాలెంలోని కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కంపెనీలో భారీగా నగదు నిల్వ చేశారనే సమాచారంతో అధికారులకు కంపెనీలో క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు. చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే నగదు ఉందా లేదా అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అంతేకాదు పలు ఫైళ్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో కంపెనీ వద్దకు తెలుగుదేశం శ్రేణులు భారీగా చేరుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో ఎలాంటి నగదు లేదని.. వైసీపీ నేతలే తమ నేతకు చెందిన కంపెనీపై ఫిర్యాదు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలకు చెందిన కంపెనీలే కాదని.. వైసీపీ పరిశ్రమల్లోనూ తనిఖీలు చేయాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.