ఏసీబీ వలలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్

by Disha Web Desk 15 |
ఏసీబీ వలలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్
X

దిశ, గంగాధర : రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఆఫీస్ సబార్డినేట్ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వెంకంపేట గ్రామానికి చెందిన కొక్కుల అజయ్ కుమార్ అనే వ్యక్తి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 131లో 486.42 చదరపు గజాల భూమిని తన తండ్రి కొక్కుల రాజేశం నుండి గిఫ్ట్ డీడ్ చేయించుకోవడానికి గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. గంగాధరకు చెందిన

తన మిత్రుడు ఆకుల అంజయ్య ద్వారా ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ శివారం సురేష్ బాబును సంప్రదించారు. గిఫ్ట్ డీడ్ చేయడానికి ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ 10 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో ఆకుల అంజయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా శనివారం సబ్ రిజిస్ట్రార్ సూచనల మేరకు 10 వేల రూపాయలను కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆఫీస్ సబార్డినేట్ గా పని చేస్తున్న కొత్త కొండ శ్రీధర్ కు ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు, ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కొత్తకొండ శ్రీధర్ పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.



Next Story

Most Viewed