ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్

by srinivas |
ఏపీలో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆరా ఎగ్జిట్ పోల్ విడుదల అయింది. ఈ పోల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 98 నుంచి 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి కూటమికి 71-81 స్థానాలు దక్కు అవకాశం ఉందని అంచనా వేసింది. పార్లమెంట్ స్థానాలు వచ్చే సరికి వైసీపీ 13 నుంచి 15, టీడీపీ-10-12 స్థానాలను దక్కించుకుంటుందని పేర్కొంది. అసెంబ్లీ పరిధిలో వైసీపీకి 49.41 శాతం ఓట్లు, పార్లమెంట్ పరిధిలో 48.29 శాతం ఓట్లు పడినట్లు తెలిపింది. టీడీపీ కూటమికి అసెంబ్లీ పరిధిలో 47.55 శాతం, పార్లమెంట్ పరిధిలో 47.68 శాతం ఓట్లు పడినట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సంస్థ తెలిపింది. ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ భారీ మెజార్టీలతో గెలవబోతున్నట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ తెలిపింది.

అసెంబ్లీ (175)

టీడీపీ-71-81

వైసీపీ-98-104

పార్లమెంట్ (25)

వైసీపీ-13-15

టీడీపీ-10-12

Advertisement

Next Story

Most Viewed